Meenakshi Chaudary: మీనాక్షి దశ తిరిగిందా.. స్టార్ హీరోతో లక్కీ ఛాన్స్!

Meenakshi Chaudary: మీనాక్షి దశ తిరిగిందా.. స్టార్ హీరోతో లక్కీ ఛాన్స్!

ఇచట వాహనములు నిలుపరాదు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఖిలాడీ బ్యూటీ మీనాక్షి చౌదరి(Meenakshi Chaudary). అక్కినేని హీరో సుశాంత్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా పరవాలేదు అనిపించింది. అయినప్పటికి.. మీనాక్షితెలుగులో మంచి అవకాశాలు దక్కించుకుంది. ఆ తరువాత మాస్ మహారాజ రవితేజతో ఖిలాడీ సినిమా చేసి భారీ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో లిప్ లాక్స్, గ్లామర్ షోతో కుర్రకారుకు కునుకు లేకుండా చేసింది ఈ బ్యూటీ. ఈ సినిమా తరువాత వచ్చిన హిట్ 2 మూవీ మీనాక్షి కెరీర్ కి మంచి బ్రేక్ ఇచ్చిందని చెప్పాలి. దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ సినిమాలో అడవి శేష్ హీరోగా నటించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. 

ఈ సినిమా సక్సెస్ తో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించే అవకాశాన్ని దక్కించుకుంది మీనాక్షి. మహేష్ హీరోగా వచ్చిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ గుంటూరు కారంలో నటించి మంచి మార్కులు తెచ్చుకుంది. అయితే తాజా సమాచారం మేరకు.. మీనాక్షి మరో బంపర్ ఆఫర్ కొట్టేసిందట. ఈ సారి ఏకంగా టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనుంది మీనాక్షి. ఇటీవల సైంధవ్ సినిమాతో భారీ ప్లాప్ అందుకున్న వెంకటేష్.. తన తరువాతి సినిమాను కామెడి చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడితో చేయనున్నాడు. 

త్వరలోనే ఈ సినిమాపై అధికకారిక ప్రకటన రానుంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్న ఈ సినిమాలో లేటెస్ట్ బ్యూటీ మీనాక్షి చౌదరిని ఫిక్స్ చేయనున్నారట మేకర్స్. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో మీనాక్షి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమా కోసం సంక్రాంతికి వస్తున్నాం అనే వెరైటీ టైటిల్ ను ఫిక్స్ చేశారట. వెచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా మీనాక్షికి ఎలాంటి అనుభవాన్ని ఇస్తుందో చూడాలి.