కేసీఆర్  ఏడేళ్లుగా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు

కేసీఆర్  ఏడేళ్లుగా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు

సీఎం కేసీఆర్  గత ఏడేళ్లుగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం డబ్బును మాత్రమే నమ్ముకుని కేసీఆర్ ఎన్నికలకు వెళ్తున్నారని విమర్శించారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సీతంపేటలో మాజీమంత్రి ఈటలతో కలిసి ప్రచారం చేశారు కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూ..సీఎం కుర్చీ తనకు ఎడమకాలి చెప్పుతో సమానమని గతంలో చెప్పిన కేసీఆర్ కు ఓటు అడిగే హక్కు లేదని అన్నారు. అబద్ధం ముందు పుట్టి కేసీఆర్ తర్వాత పుట్టాడని విమర్శించారు.

హుజురాబాద్ లో ఈటల రాజేందర్ ను ఓడించడానికి కేసీఆర్ వందల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారని అన్నారు కిషన్ రెడ్డి. ఇంతటి అధికార దుర్వినియోగాన్ని తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు. బీజేపీకి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ అని... అలాంటి పార్టీతో బీజేపీకి పొత్తు ఎప్పుడూ ఉండదని చెప్పారు. దళితబంధు ఆపేయించారని మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికలైన తెల్లారి అందరికీ దళితబంధు ఇవ్వాలని సవాల్ చేశారు కిషన్ రెడ్డి. KCR తెలంగాణ ద్రోహి అని అంతా భావిస్తున్నారన్నారు ఈటల రాజేందర్. హుజురాబాద్ ఎన్నికతో కేసీఆర్ నిజస్వరూపం బయటపడుతుందన్నారు.