ఖేలో ఇండియా స్కీమ్‌తో క్రీడాకారులకు ప్రోత్సాహం

ఖేలో ఇండియా స్కీమ్‌తో  క్రీడాకారులకు ప్రోత్సాహం

క్రీడలపై ఆసక్తి ఉన్న యువతి, యువకులను మరింత ప్రోత్సాహించాల్సిన అవసరం ఉందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో ఒలింపిక్స్ లో మన క్రీడాకారులు సత్తా చాటారన్నారు. ఖేలో ఇండియా స్కీమ్ ద్వారా ఎంతో మంది క్రీడాకారులను కేంద్రం ప్రోత్సహిస్తుందన్నారు. తెలంగాణలో క్రీడల అభివృద్ధి కోసం కేంద్రం 26 కోట్లు కేటాయించిందన్నారు కిషన్ రెడ్డి. అన్ని జిల్లాల్లో స్పోర్ట్స్ కాంప్లెక్సులు నిర్మిస్తున్నట్లు చెప్పారు రాష్ట్రమంత్రి శ్రీనివాస్ గౌడ్. ఉస్మానియా యూనివర్సిటీలోని సీ గ్రౌండ్స్ లో ఖేలో ఇండియా స్కీమ్ ద్వారా పలు స్పోర్ట్స్ కాంప్లెక్సుల శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. కేంద్రమంత్రి  కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్..  ఓయూ వీసీ రవీందర్, అధికారులు కార్యక్రమానికి హాజరయ్యారు.