బీజేపీ కార్యకర్తలను భయపెట్టాలని చూస్తున్నారు

బీజేపీ కార్యకర్తలను భయపెట్టాలని చూస్తున్నారు

కరీంనగర్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జైలులో పరామర్శించారు. జాగరణ దీక్షణ సందర్భంగా జరిగిన పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్ తీరును కడిగిపారేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అక్రమ అరెస్టులతో బీజేపీ కార్యకర్తలను భయపెట్టాలని చూస్తున్నారని.. టీఆర్ఎస్ తాటాకు చప్పుళ్లకు, అక్రమ కేసులకు బెదిరే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు. బీజేపీ కార్యకర్తలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఇంతటి నిర్భందం, నియంతృత్వం చూడలేదని, కేసీఆర్ తీరు నిజాం పాలనను తలపిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ సమాజం, మేధావులు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్న కిషన్ రెడ్డి.. తెలంగాణ సమాజం నియంతృత్వ పాలనకు చరమగీతం పాడుతుందని హెచ్చరించారు.