కేసీఆర్‌ను గద్దె దించేందుకే బండి సంజయ్ యాత్ర

కేసీఆర్‌ను గద్దె దించేందుకే బండి సంజయ్ యాత్ర

టీఆర్ఎస్ ను గద్దె దించటానికే బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నారన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.  తెలంగాణలో అవినీతి రూపంలో వేల కోట్లు వృదా  అవుతున్నాయన్నారు. కల్వకుంట్ల కుటుంబం ఎన్ని కుట్రలు చేసినా.. హుజురాబాద్ లో బీజేపీ గెలవటం ఖాయమన్నారు. తెలంగాణ వచ్చాక నిరుద్యోగులు సహా.. ఏ వర్గం సంతోషంగా లేదన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లోకి తెలంగాణ ప్రభుత్వం దిగజారిపోయిందన్నారు. దళితులకు ముఖ్యమంత్రి, మూడెకరాల భూమి పేరుతో కేసీఆర్ మోసం చేశారని..బీసీలకు వెన్నుపోటు పొడిచారన్నారు. ఉద్యమ ఆకాంక్షలకు వ్యతిరేకంగా కేసీఆర్ పాలన సాగుతోందన్నారు. కుటుంబ పాల‌నను పక్కన పెట్టి తెలంగాణలో ప్రజాస్వామ్య పాలనకు స్వాగతం పలకబోతున్నారన్నారు. పాతబస్తీ అభివృద్ధిని ఎంఐఎం, టీఆర్ఎస్ లు అడ్డుకుంటున్నాయన్నారు. పాతబస్తీకి మెట్రోరైల్ ను ఎందుకు తీసుకురావటంలేదో చెప్పాలన్నారు. ఏడేళ్ళుగా సీఎం కేసీఆర్ ఫాంహౌస్ కే పరిమితమయ్యారన్నారు.