కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయింది: కిషన్ రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయింది: కిషన్ రెడ్డి

హైదరాబాద్ నగర అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ పాత్ర కీలకమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుటుంబ పార్టీలుగా.. అవినీతి అసమర్ధ పాలనలో ఆరి తేరాయని విమర్శించారు. ఫిబ్రవరి 14వ తేదీ బుధవారం కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో పర్యటించారు. సందర్భంగా  నూతనంగా ఏర్పాటు చేసిన పవర్ బోర్ వెల్ లను ఆయన ప్రారంభించారు.

అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీపై ఫైర్ అయ్యారు. ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చినప్పటికీ.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్న నమ్మకం ప్రజలకు లేకుండా పోయిందన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేని పరిస్థితులలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలకు రెండు పడక గదుల ఇండ్లు ఇస్తామని మోసం చేసిందని.. దాదాపు 40 వేల ఇళ్లు ఖాళీగా ఉన్నప్పటికీ పేదలకు ఇవ్వడంలో పూర్తిగా విఫలమైందని కిషన్ రెడ్డి మండిపడ్డారు.