సుష్మా స్వరాజ్ లేకుంటే తెలంగాణ వచ్చేదా.? : కిషన్ రెడ్డి.

సుష్మా స్వరాజ్ లేకుంటే తెలంగాణ వచ్చేదా.? : కిషన్ రెడ్డి.

సుష్మా స్వరాజ్ లేకుంటే అసలు  తెలంగాణ వచ్చేదా? అని ప్రశ్నించారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి. జై తెలంగాణ అంటే తుపాకులతో కాల్చి చంపిన చరిత్ర  కాంగ్రెస్ దని విమర్శించారు . కాంగ్రెస్ నుంచి ఒక్కరు గెలిచినా కొనేది కేసీఆరేనని ఆరోపించారు .

హైదరాబాద్ లో బీజేపీ స్టేట్ కౌన్సిల్ మీటింగ్ జరుగుతోంది. ఈ సమావేశానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా..రాష్ట్ర ముఖ్య నేతలు హాజరయ్యారు.  ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్డి...

ALSO READ : మహాదేవ్ APPలో అంత లాభాలా : పెళ్లికి రూ.200 కోట్లు ఖర్చు పెట్టాడా.. ఏం పెట్టాడు.. ఎలా చేశాడు..?

ఓవైసీనీ ప్రసన్నం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు.  కుటుంబ వ్యవస్థను పెంచి పోషించింది కాంగ్రెస్సేనని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ లను ఓడించాల్సిందేనన్నారు.  దేశంలో సకల సమస్యలకు కాంగ్రెస్సే కారణమని ధ్వజమెత్తారు. బీజేపీలో  అందరం క్రమశిక్షణతో ముందుకెళ్తున్నామని..ఇదే జోష్ తో వచ్చే ఎన్నికల్లో సత్తా చాటుతామని చెప్పారు.