టీవీ ఛానెల్స్పై నిషేధం పెట్టింది బీఆర్ఎస్సే : కిషన్ రెడ్డి

టీవీ ఛానెల్స్పై నిషేధం పెట్టింది బీఆర్ఎస్సే : కిషన్ రెడ్డి

బీబీసీపై ఐటీ దాడులతో దేశ ప్రతిష్ట దిగజార్చుతున్నారన్న హరీష్ రావు వ్యాఖ్యలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తాము ఎవరిపైనా దాడులు చేయడం లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నుంచి తాము పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. గతంలో రాష్ట్రంలో టీవీ ఛానెల్స్ పై నిషేధం పెట్టిన ఘనత బీఆర్ఎస్సేదేనని గుర్తు చేశారు.

టూరిజం శాఖ ఆధ్వర్యంలో దేశ పర్యటక రంగంలో కొత్త మార్పులు తీసుకువస్తున్నామని కిషన్ రెడ్డి చెప్పారు. అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ఈ రంగ అభివృద్ధికి కృషి చేస్తున్నామని వెల్లడించారు. దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేలా టూరిజాన్ని అభివృద్ధి చేస్తున్నామని కిషన్ రెడ్డి  చెప్పారు.