Stocks to Buy: బ్రోకరేజీలు మెచ్చిన టాప్-5 స్టాక్స్.. 38% వరకు లాభాలు..

Stocks to Buy: బ్రోకరేజీలు మెచ్చిన టాప్-5 స్టాక్స్.. 38% వరకు లాభాలు..

Investment Ideas: గడచిన కొన్ని రోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్లు సానుకూల ధోరణిలో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో పెట్టుబడిదారులు తమ డబ్బును ఇన్వెస్ట్ చేసేందుకు బ్రోకరేజ్ సంస్థల సూచనలను కూడా పరిగణిస్తున్నారు. మరికొందరు తమ సొంత పెట్టుబడి వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు వివిధ బ్రోకరేజ్ సంస్థలు సూచించిన కొన్ని షేర్ల వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం..

* ముందుగా దేశీయ బ్రోకరేజ్ సంస్థ జేఎం ఫైనాన్షియల్స్ ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ కంపెనీ షేర్లపై తన సానుకూలతను ప్రకటించింది. కంపెనీ షేర్లకు బై రేటింగ్ అందిస్తూ టార్గెట్ ధరను షేరుకు రూ.231గా ఫిక్స్ చేసింది. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ కారణంగా స్వల్ప కాలంలో పవర్ మార్కెట్ 18 శాతం చూస్తున్నట్లు బ్రోకరేజ్ పేర్కొంది. కంపెనీ ఆదాయాలు పెరుగుతాయని బ్రోకరేజ్ తన అంచనాల్లో వెల్లడించింది. 

* మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ టైమ్ టెక్నోప్లాస్ట్ కంపెనీ షేర్లపై బులిష్ గా ఉన్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో కంపెనీ షేర్లు ప్రస్తుత స్థాయి కంటే 33 శాతం వరకు పెరిగి రూ.578 స్థాయికి చేరుకోవచ్చని తన అంచనాలను పంచుకుంది. కంపెనీ రానున్న రెండేళ్లలో రుణ విముక్తులుగా మారేందుకు చేస్తున్న ప్రయత్నాలతో కొనుగోలు రేటింగ్ అందించింది. అలాగే కంపెనీ తన ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ లాభదాయకతపై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు బ్రోకరేజ్ వెల్లడించింది. 

* దేశీయ టెక్స్‌టైల్ దిగ్గజం వెల్‌స్పన్ కంపెనీ షేర్లపై విదేశీ బ్రోకరేజ్ జెఫరీస్ బులిష్ గా ఉన్నట్లు ప్రకటించింది. ఈ సంస్థ విదేశాలకు ఎక్కువగా తన ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంటుంది. అమెరికా, యూరోపియన్ యూనియన్, యూకే మార్కెట్లు ప్రధాన కస్టమర్లుగా ఉన్నాయి. ఈ క్రమంలో కంపెనీ మెరుగైన పనితీరుతో రానున్న కాలంల్లో షేర్లు ప్రస్తుత స్థాయి కంటే 33 శాతం పెరిగి రూ.185కు చేరుకుంటాయని బ్రోకరేజ్ పేర్కొంది. దీంతో ప్రస్తుతం షేర్లకు బై రేటింగ్ అందిస్తున్నట్లు పేర్కొంది. అయితే అమెరికా టారిఫ్స్, పెరిగిన పత్తి ధరలు కంపెనీకి సమస్యలను తెచ్చిపెట్టొచ్చని హెచ్చరించింది. 

* ఇక ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించదగిన షేర్ల జాబితాలో ఈ2ఈ నెట్వర్క్స్ పేరును చేర్చింది దలాల్ అండ్ బ్రోచ. కంపెనీ షేర్లు రానున్న కాలంలో ప్రస్తుత స్థాయిల కంటే 38 శాతం పెరిగి ఒక్కోటి రూ.3వేల 750కి చేరుకోవచ్చని వెల్లడించింది. 

* ఇక చివరిగా గో ఫ్యాషన్ ఇండియా షేర్లపై మోతీలాల్ ఓస్వాల్ కొనుగోలు రేటింగ్ అందించింది. మహిళల వస్త్రాల వ్యాపారంలో ఉన్న కంపెనీ షేర్లు ప్రస్తుతం ఉన్న స్థాయి కంటే 30 శాతం వరకు పెరిగి ఒక్కోటి రూ.వెయ్యి 127కి పెరగవచ్చని బ్రోకరేజ్ వెల్లడించింది. కంపెనీ ప్రస్తుతం 180 నగరాల్లో వ్యాపారాన్ని కలిగి ఉండగా, దీనిని మరింతగా విస్తరించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఆదాయాలను పెంచుతాయని బ్రోకరేజ్ అంచనా వేస్తోంది. 

NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.