
జూలై 1 నుంచి తత్కాల్ టిక్కెట్లు బుక్కింగ్ చేసుకునే వ్యక్తులకు ఆధార్ అథెంటికేషన్ ఖచ్చితం చేస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని జూన్ 10న ఒక సర్క్యులర్ ద్వారా ప్రకటించారు. తత్కాల్ టిక్కెట్ల విషయంలో జరుగుతున్న మోసాలను అరికట్టడమే దీని లక్ష్యంగా ఉంది.
వచ్చే నెల మెుదటి తారీఖు నుంచి రైల్వే యాప్ లేదా వెబ్ సైట్ నుంచి ఆధార్ ద్వారా ధృవీకరించబడిన వ్యక్తులు మాత్రమే తత్కాల్ టిక్కెట్లను పొందగలరని స్పష్టం చేయబడింది. అలాగే జూలై 15 నుంచి తత్కాల్ టిక్కెట్ల బుక్కింగ్ సమయంలో ఆధార్ ఓటీపీ వెరిఫికేషన్ కూడా ఖచ్చితంగా మార్చబడింది.
IRCTC ఖాతాకు ఆధార్ అథెంటికేషన్ ఇలా..
1. అధికారిక IRCTC వెబ్సైట్ లేదా యాప్ని ఖాతా వివరాల ద్వారా లాగిన్ అవ్వండి.
2. 'మై అకౌంట్'కి వెళ్లి 'వినిAuthenticate User' ఎంచుకోండి.
3. అక్కడ మీ పాన్ కార్డ్ నంబర్, ఆధార్ నంబర్ లేదా వర్చువల్ IDని నమోదు చేయండి.
4. 'వివరాలను ధృవీకరించటం'పై క్లిక్ చేయండి.
5. మీ ఆధార్-లింక్ చేయబడిన మొబైల్ నంబర్కు వచ్చిన వన్-టైమ్ పాస్వర్డ్ని నమోదు చేసిన తర్వాత సబ్మిట్ చేయండి.
ఆధార్ నంబర్ IRCTC ఖాతాకు లింక్ చేయటం ఎలా..
1. అధికారిక IRCTC పోర్టల్ను సందర్శించండి.
2. మీ ఖాతా వివరాలను ఉపయోగించి లాగిన్ అవ్వండి.
3. "ప్రొఫైల్ ట్యాబ్" కింద "లింక్ ఆధార్" క్లిక్ చేయండి.
4. మీ ఆధార్ కార్డ్లో ఉన్న విధంగా పేరు, ఆధార్ నంబర్ను నమోదు చేయండి.
5. చెక్ బాక్స్ పై క్లిక్ చేసిన తర్వాత 'Send OTP'పై క్లిక్ చేయండి.
6. మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్కు పంపిన OTPని నమోదు చేసి, 'Verify OTP' క్లిక్ చేయండి.
7. KYC వివరాలు ఆధార్ నుంచి తీసుకోబడతాయి. దీని తర్వాత ధృవీకరణను పూర్తి చేయడానికి 'అప్డేట్'పై క్లిక్ చేయండి.
అయితే ఈ ప్రక్రియను పూర్తి చేయటానికి ముందుగా ఆధార్ కార్డ్ కు మెుబైల్ నంబర్ లింక్ అయ్యి ఉందో లేదో చూసుకోవటం మంచిది. ఎందుకంటే ఆ నంబరుకే వెరిఫికేషన్ ఓటీపీలు పంపబడతాయి. వేగవంతమైన తత్కాల్ టిక్కెట్ బుక్కింగ్ కోసం ఆధార్ లింక్ చేసి ముందుగానే ఖాతాను సిద్ధంగా ఉంచుకోవటం సయమం వృధా కాకుండా కాపాడుతుంది.