ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. ఏఏ రంగాల స్టాక్స్ ప్రభావితం అవుతాయి..? లిస్ట్ ఇదిగోండి..

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. ఏఏ రంగాల స్టాక్స్ ప్రభావితం అవుతాయి..? లిస్ట్ ఇదిగోండి..

అమెరికా వద్దంటున్నా వినకుండా ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్ పై ఒక్కసారిగా దాడికి దిగింది. అయితే రాత్రికి రాత్రి మెుదలైన ఈ పరిస్థితులు రెండు దేశాలనే కాకుండా యావత్ ప్రపంచాన్ని ఆందోళనలకు గురిచేస్తోంది. మధ్యప్రాశ్చంలో రగులుతున్న యుద్ధ మంటలు భారత స్టాక్ మార్కెట్లకు సైతం వ్యాపించాయి. 

నేడు ఇంట్రాడేలో భారతీయ ఈక్విటీ మార్కెట్లు భారీ పతనాన్ని చూశాయి. ఈ క్రమంలో క్రూడ్ ఆయిల్ ధరలు అమాంతం పెరగటం కారణంగా.. ఎయిర్ లైన్ పరిశ్రమ, టైర్స్ ఇండస్ట్రీ, ఇంజిన్ లూబ్రికెంట్స్ కంపెనీలు, ప్రభుత్వ ప్రైవేటు ఆయిల్ సంస్థల షేర్లు ప్రతికూలంగా ప్రభావితం అవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2022లో రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఆందోళనల కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు 130 డాలర్లకు బ్యారెల్ రేటు చేరుకునే ప్రమాదం ఉందని అమెరికాకు చెందిన జేపీ మోర్గన్ సంస్థ హెచ్చరించిన సంగతి తెలిసిందే. 

ప్రస్తుతం పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు భారత్, థాయిలాండ్ వంటి దేశాల ఆర్థిక వ్యవస్థలను ప్రతికూలంగా ప్రభావితం చేసే ప్రమాదం ఉందని నోమురా ప్రతినిధి రాబర్ట్ సుబ్బరామన్ వెల్లడించారు. ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ బ్యారెల్ కు ఒక్క డాలర్ పెరిగితే అతి భారతదేశ వాణిజ్య లోటును రూ.25వేల కోట్ల మేర పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ సమయంలో దూసుకుపోతున్న డిఫెన్స్ స్టాక్స్..

  • హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్
  • భారత్ ఎలక్ట్రానిక్స్ 
  • మెజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్
  • భారత్ డైనమిక్స్
  • కొచ్చిన్ షిప్ యార్డ్
  • పరాగ్ డిఫెన్స్