మళ్లీ దొరల పాలన కొనసాగడం దురదృష్టకరం

మళ్లీ దొరల పాలన కొనసాగడం దురదృష్టకరం

రాష్ట్రంలో మళ్లీ దొరల పాలన కొనసాగడం దురదృష్టకరమన్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ జనసమితి పార్టీ ఆఫీస్ లో సెప్టెంబర్ 17 వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగురవేశారు కోదండరాం. దొరలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం కోసం ప్రజలు పోరాడారని.. మళ్లీ ఇప్పుడు దొరల పాలన వచ్చిందన్నారు. తెలంగాణ చరిత్ర మరుగున పడకుండా.. విలీన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.