కోడి పుంజును లాకప్​లో వేసిన పోలీసులు

 కోడి పుంజును లాకప్​లో వేసిన పోలీసులు

మహబూబ్​నగర్ టౌన్(జడ్చర్ల), వెలుగు: రెండు రోజులుగా మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్ల పోలీస్ స్టేషన్ లాకప్​లో ఓ కోడి పుంజు బందీ అయింది. పోలీసులే దానికి తిండి పెడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జడ్చర్ల మండలం బూరెడ్డిపల్లిశారులో తరచుగా నాటు కోళ్ల దొంగతనాలు జరుగుతున్నాయి. 

ఇటీవల కర్వెన గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కోళ్లు దొంగతనం చేస్తుండగా, గ్రామస్తులు పట్టుకున్నారు. అతనితోపాటు ఓ కోడిపుంజును పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఆ వ్యక్తిని, కోడి పుంజును లాకప్​లో వేసి విచారణ చేపడుతున్నారు. స్టేషన్​కు వచ్చిపోయేవారు లాకప్​లోని కోడి పుంజును చూసి ఆశ్చర్యపోతున్నారు. కోడిని కూడా లోపల వేస్తారా అని చర్చించుకుంటున్నారు.