కుత్బుల్లాపూర్​లోఎగిరేది కాంగ్రెస్ జెండానే

కుత్బుల్లాపూర్​లోఎగిరేది కాంగ్రెస్ జెండానే

జీడిమెట్ల, వెలుగు : కుత్బుల్లాపూర్ సెగ్మెంట్​లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని ఆ పార్టీ అభ్యర్థి కొలను హన్మంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కుత్బుల్లాపూర్ సెగ్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గురువారం ఆయన నామినేషన్ వేశారు. అంతకుముందు ఐడీపీఎల్ చౌరస్తా నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులతో కలిసి ర్యాలీగా ఆర్వో సెంటర్​కు చేరుకున్నారు. రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పేపర్లను అందజేశారు. 

ఈ సందర్భంగా హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ.. నామినేషన్ ర్యాలీకి అంచనాలకు మించి సుమారు 50 వేల మంది తరలిరావడం సంతోషంగా ఉందన్నారు. ఈ ర్యాలీనే కాంగ్రెస్ పార్టీ విజయానికి సంకేతమన్నారు. రాబోయే రోజుల్లో ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్​లో భారీగా చేరికలుంటాయని ఆయన తెలిపారు. రాష్ట్రంలో పార్టీ మరింత బలోపేతంగా మారుతుందన్నారు. పదేండ్లుగా బీఆర్ఎస్​ను నమ్మి జనం మోసపోయారని ఆయన విమర్శించారు. 

కుత్బుల్లాపూర్​తో పాటు రాష్ట్రంలో మెజార్టీ స్థానాలు గెలిచి కాంగ్రెస్​ను అధికారంలోకి తీసుకొచ్చి సోనియాగాంధీకి బహుమతిగా ఇస్తామని ఆయన పేర్కొన్నారు. తొందరలోనే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రోడ్ షోలు నిర్వహిస్తారని హన్మంత్ రెడ్డి తెలిపారు.

కాంగ్రెస్ అభ్యర్థి కొలను హన్మంత్ రెడ్డి
 
జీడిమెట్ల, వెలుగు : కుత్బుల్లాపూర్ సెగ్మెంట్​లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని ఆ పార్టీ అభ్యర్థి కొలను హన్మంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కుత్బుల్లాపూర్ సెగ్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గురువారం ఆయన నామినేషన్ వేశారు. అంతకుముందు ఐడీపీఎల్ చౌరస్తా నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులతో కలిసి ర్యాలీగా ఆర్వో సెంటర్​కు చేరుకున్నారు. రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పేపర్లను అందజేశారు. ఈ సందర్భంగా హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ.. నామినేషన్ ర్యాలీకి అంచనాలకు మించి సుమారు 50 వేల మంది తరలిరావడం సంతోషంగా ఉందన్నారు. ఈ ర్యాలీనే కాంగ్రెస్ పార్టీ విజయానికి సంకేతమన్నారు. 

రాబోయే రోజుల్లో ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్​లో భారీగా చేరికలుంటాయని ఆయన తెలిపారు. రాష్ట్రంలో పార్టీ మరింత బలోపేతంగా మారుతుందన్నారు. పదేండ్లుగా బీఆర్ఎస్​ను నమ్మి జనం మోసపోయారని ఆయన విమర్శించారు. కుత్బుల్లాపూర్​తో పాటు రాష్ట్రంలో మెజార్టీ స్థానాలు గెలిచి కాంగ్రెస్​ను అధికారంలోకి తీసుకొచ్చి సోనియాగాంధీకి బహుమతిగా ఇస్తామని ఆయన పేర్కొన్నారు. తొందరలోనే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రోడ్ షోలు నిర్వహిస్తారని హన్మంత్ రెడ్డి తెలిపారు.