పోలీస్ స్టేషన్‎లోనే రూ.20 వేల లంచంతో దొరికిన కొల్లూరు SI

పోలీస్ స్టేషన్‎లోనే రూ.20 వేల లంచంతో దొరికిన కొల్లూరు SI

సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్‎లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఎస్‎ఐ రమేష్ రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‏గా పట్టుబడ్డాడు. ఎస్‎ఐ రమేష్‎కు సంబంధించిన ఆస్తులపైన విచారణ చేపట్టారు ఏసీబీ అధికారులు. 2025 అక్టోబర్ 17న పీడీఎస్ రైస్‎ను అక్రమంగా తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో లారీ ఓనర్ సహా పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

కేసు నుంచి తప్పిస్తానని లారీ ఓనర్‎ను లంచం డిమాండ్ చేశాడు కొల్లూరు ఎస్ఐ రమేష్. దీంతో లారీ ఓనర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల సూచన మేరకు లారీ ఓనర్ పోలీస్ స్టేషన్‎కు వెళ్లి ఎస్ఐ రమేష్ రూ.20 వేలు లంచం ఇస్తుండగా రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఎస్ఐను రెడ్ హ్యాండెడ్‎గా పట్టుకున్నారు. రమేష్‎కు సంబంధించిన ఆస్తులపై విచారణ చేపట్టారు ఏసీబీ అధికారులు. ఎస్ఐ ఏకంగా స్టేషన్‎లోనే లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరకడం పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.