హైదరాబాద్, వెలుగు: తాము అధికారంలో ఉన్న 50 ఏండ్లల్లో జరిగిన అభివృద్ధి పనులు కేసీఆర్కు తెలియదా అని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ రాజకీయ ప్రస్థానం మొదలైందే కాంగ్రెస్ నుంచి అని గుర్తుచేశారు. బొగ్గు గనుల పరిశోధనల కోసం పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ స్టడీ టూర్లో భాగంగా మంగళవారం కర్నాటకలోని కూర్గ్లో సమావేశం నిర్వహించారు. అందులో పాల్గొన్న అనంతరం కోమటిరెడ్డి వీడియో మెసేజ్ విడుదల చేశారు.
రాష్ట్రంలో నాగార్జు నసాగర్, శ్రీశైలం, శ్రీరాంసాగర్, కల్వకుర్తి ప్రాజెక్టులను కాంగ్రెస్సే కట్టించిందని తెలిపారు. నాగార్జున సాగర్ ద్వారా నల్గొండ, ఖమ్మం జిల్లాలోని వేల ఎకరా లకు ఇప్పటికీ నీళ్లు అందుతు న్నాయని వెల్లడించారు. కాంగ్రెస్ హయాంలో ఒకటో తేదీకల్లా పింఛన్లు ఇచ్చామన్నారు. ఉచిత కరెంట్, రైతు రుణమా ఫీలు చేసిందే కాంగ్రెస్ అని స్పష్టం చేశారు. ఆయన ప్రకటించిన 115 మంది అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఉండగా ఎంత సంపాదించారో ప్రజలు గమనించాలని కోరారు. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయాలని విజ్ఞప్తి చేశారు.