50 ఏండ్లలో కాంగ్రెస్ ఏం చేసిందో నీకు తెల్వదా?: కోమటిరెడ్డి

50 ఏండ్లలో కాంగ్రెస్ ఏం చేసిందో  నీకు తెల్వదా?:  కోమటిరెడ్డి

హైదరాబాద్, వెలుగు: తాము అధికారంలో ఉన్న 50 ఏండ్లల్లో జరిగిన అభివృద్ధి పనులు కేసీఆర్​కు తెలియదా అని కాంగ్రెస్​ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్​ రాజకీయ ప్రస్థానం మొదలైందే కాంగ్రెస్​ నుంచి అని గుర్తుచేశారు. బొగ్గు గనుల పరిశోధనల కోసం పార్లమెంట్​ స్టాండింగ్ కమిటీ స్టడీ టూర్​లో భాగంగా మంగళవారం కర్నాటకలోని కూర్గ్​లో సమావేశం నిర్వహించారు. అందులో పాల్గొన్న అనంతరం కోమటిరెడ్డి  వీడియో మెసేజ్​ విడుదల చేశారు. 

రాష్ట్రంలో నాగార్జు నసాగర్, శ్రీశైలం, శ్రీరాంసాగర్​, కల్వకుర్తి ప్రాజెక్టులను కాంగ్రెస్సే కట్టించిందని తెలిపారు. నాగార్జున సాగర్​ ద్వారా నల్గొండ, ఖమ్మం జిల్లాలోని వేల ఎకరా లకు ఇప్పటికీ నీళ్లు అందుతు న్నాయని వెల్లడించారు. కాంగ్రెస్ ​హయాంలో ఒకటో తేదీకల్లా పింఛన్లు ఇచ్చామన్నారు. ఉచిత కరెంట్, రైతు రుణమా ఫీలు చేసిందే కాంగ్రెస్ అని స్పష్టం చేశారు. ఆయన ప్రకటించిన 115 మంది అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఉండగా ఎంత సంపాదించారో ప్రజలు గమనించాలని కోరారు. వాటిని సోషల్​ మీడియాలో షేర్​ చేయాలని విజ్ఞప్తి చేశారు.