మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి బీజేపీలో చేరనున్నారు. ఈ రోజు(ఆదివారం) సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరగనున్న బీజేపీ విజయ సంకల్ప సభలో ఆయన బీజేపీ తీర్ధం పుచ్చుకోనున్నారు. మోడీ సభకు వచ్చిన కొండా చేయి పట్టుకుని బీజేపీ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ చుగ్ ప్రజలకు అభివాదం చేయించారు. అంతకుముందు విశ్వేశ్వర్రెడ్డి కూడా తన ట్విట్టర్ వేదికగా ఈరోజు బీజేపీలో చేరబోతున్నట్లుగా తెలిపారు.
కాగా 2013లో టీఆర్ఎస్ లో చేరి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కొండా విశ్వేశ్వర్రెడ్డి.. 2014 ఎన్నికల్లో చేవెళ్ళ లోకసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 75,000 ఓట్లకు పైగా తేడాతో గెలుపొందారు. 2018 నవంబరులో టీఆర్ఎస్ కు రాజీనామా చేసి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఆ తరువాత 2021 మార్చిలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. ఇప్పుడు బీజేపీలో చేరనున్నారు.
Today I am joining the Bharatiya Janata Party at the public meeting. pic.twitter.com/awj9kf34yW
— Konda Vishweshwar Reddy (@KVishReddy) July 3, 2022