కొండగట్టు అంజన్నకు చందనోత్సవం

కొండగట్టు అంజన్నకు చందనోత్సవం

ఘనంగా జయంతి వేడుకలు

కొండగట్టు, వెలుగు: జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో శనివారం హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు రెండో రోజు ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి చందనోత్సవం, విష్ణు సహస్రనామ పారాయణం, మధ్యాహ్నం పూర్ణాహుతి, సాయంత్రం మహానివేదన కార్యక్రమాలు నిర్వహించారు. కరోనా వైరస్ నేపథ్యంలో గుట్ట పైకి భక్తులను అనుమతించడం లేదు. ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్, ఏఈవో బుద్ధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు జితేంద్ర ప్రసాద్, పూజారి చిరంజీవి వేడుకలను నిర్వహించారు. ఆలయ టస్ట్రీ వకుళాభరణం మారుతి, శ్రీనివాస శర్మ, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి