
జీడిమెట్ల,వెలుగు: బీజేపీకి పడే ఓట్లను చీల్చేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని డ్రామాలడినా కుత్బుల్లాపూర్లో కమలం జెండా ఎగురుతుందని బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ తెలిపారు. మంగళవారం సెగ్మెంట్లోని పలు ప్రాంతాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ.. ఎన్నికల అనంతరం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసిపోతాయన్నారు.
కుత్బుల్లాపూర్ సెగ్మెంట్ అభివృద్ది చెందాలంటే బీజేపీని గెలిపించాలన్నారు. అనంతరం కుత్బుల్లాపూర్లోని హమాలీ లతో శ్రీశైలం గౌడ్ సమావేశమయ్యారు. బీజేపీ అధికారంలోకి రాగానే కార్మిక బోర్డు ఏర్పాటు చేస్తా మని చెప్పారు. ఆరోగ్య బీమాతో పాటు జీడిమెట్లలోని ఈఎస్ఐ ఆస్పత్రిలో అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తామని ఆయన హమీ ఇచ్చారు.