పోలీసులు ఇలాగే వ్యవహరిస్తే... మళ్ళీ నక్సలిజాన్ని తయారు చేస్తా : కూర రాజన్న

పోలీసులు ఇలాగే వ్యవహరిస్తే... మళ్ళీ నక్సలిజాన్ని తయారు చేస్తా : కూర రాజన్న

పోలీసులపై సంచలన వ్యాఖ్యలు  చేశారు జనశక్తి పార్టీ మాజీ కేంద్ర కమిటీ కార్యదర్శి కూర రాజన్న. తనకు ఆశ్రయం ఇచ్చిన వారిపై పోలీసులు అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని  ఆయన ఆరోపించారు. పొలీసులు అక్రమ కేసులు పెడితే తాను ఊరుకోనని చెప్పారు.  పోలీసులు ఇలాగే దుర్మార్గంగా వ్యవహరిస్తే మళ్ళీ తాను నక్సలిజాన్ని తయారు చేస్తానని చెప్పారు. 

తనకు ప్రస్తుతం ఆరోగ్యం బాలేదని చెప్పిన రాజన్న...తనకు ఒక స్నేహితుడు సహకారం చేస్తే పోలీసులు అతనిపై అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పారు. తన వల్ల ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్  ఉండవని ఇప్పటికే పోలీసులకు చెప్పానని ..  అయినప్పటికీ ఇద్దరు పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. పోలీసులు మళ్ళీ తనను అడివిలోకి వెళ్లే విదంగా చేస్తున్నారన్న రాజన్న...  అవసరం పడితే వారం రోజుల్లో జనశక్తిని రీఆర్గనైజేషన్ చేస్తానని తెలిపారు.  

 సమాజంలో తనకు మాట్లాడే, తిరిగే హక్కు లేదా అని ప్రశ్నించారు కూర రాజన్న. ప్రశ్నించే వారిని పోలీసులు జైల్లో పెడుతున్నారని, తాము అన్నింటికీ సిద్ధమయ్యే వచ్చామని చెప్పారు. నక్సలైట్ అంటే నేరస్థుడా..? హంతకుడా..? ఆది కూడా ప్రజల కోసం ఏర్పడిన పార్టేనే అన్నారు,  

పాలకులు ద్రోహులు, దొంగలని, అసెంబ్లీ అనేది ఒక దొంగలకు అడ్డానని అన్నారు.   నాలుగు రూపాయల కోసం మీరు డ్యూటీ చేస్తున్నారని పోలీసులను ఆయన ప్రశ్ని్ంచారు.   పోలీసులు రాజ్యాంగాన్ని ఉల్లంగిస్తున్నారని, ఇలాంటి దుర్మార్గం లాంటి పనులు మానుకోవాలని రాజన్న సూచించారు.