- కొత్త ఇంట్లోకి ఆహ్వానం పలికిన కేంద్ర మంత్రులు
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సోమవారం కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు. ఇకపై ఆయన 12 జన్పథ్లోని బంగ్లాలో ఉంటా రు. పదవీకాలం పూర్తవడంతో రాష్ట్రపతి భవన్ను కోవింద్ ఖాళీ చేశారు. ఒకప్పుడు ఈ బిల్డింగ్లో కేంద్ర మాజీ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ ఉండేవారు. 2020లో ఆయన చనిపోయారు. ఆ తర్వాత రాంవిలాస్ కొడుకు చిరాగ్ పాశ్వాన్ అందులో ఉండగా.. ఏప్రిల్లో ప్రభుత్వం ఖాళీ చేయించింది.
ఆ తరువాత దాన్ని అందంగా ముస్తాబు చేసి కోవింద్కు కేటాయించింది. ఇక ఆయన రిటైర్మెంట్ లైఫ్ను ఇక్కడే గడుపుతారు. 12 జన్పథ్లో కోవింద్కు బంగ్లా కేటాయించడం సంతోషంగా ఉందని న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజుజు ట్వీట్ చేశారు. బంగ్లాలో కోవింద్ను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు హర్దీప్సింగ్ పూరీతో పాటు వీకే సింగ్ కలుసుకున్నారు. ఆయన్ను కొత్త ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించారు.
కోవింద్కు అందే రిటైర్మెంట్ బెనిఫిట్స్
- రాష్ట్రపతిగా ఉన్న సమయంలో రామ్నాథ్ కోవింద్కు నెలకు రూ.5లక్షల వేతనం ఉండేది. రిటైర్ కావడంతో.. రాష్ట్రపతి పారితోషికాలు, పెన్షన్ యాక్ట్ 1951 ప్రకారం.. రూ.2.50 లక్షల పెన్షన్ ప్రభుత్వం ఇస్తుంది.
- ప్రైవేట్ సెక్రటరీ, అడిషనల్ ప్రైవేట్ సెక్రటరీ, ఒక పీఏ, ఇద్దరు ప్యూన్లు ఉంటారు. ఆఫీసు ఖర్చులకు ఏటా రూ.1లక్ష ఇస్తుంది.
- ఉచితంగా మెడికల్ ట్రీట్మెంట్ అందజేస్తుంది. ఇండియాలో ఎక్కడికైనా ఫ్రీగా వెళ్లొచ్చు. ఫస్ట్ క్లాస్ టికెట్ను ప్రభుత్వమే కేటాయిస్తుంది. కోవింద్ వెంట మరొకరికి కూడా ఫ్రీ ట్రావెల్ చాన్స్ ఉంటుంది. విమానం, ట్రైన్ లేదా స్టీమర్లో కూడా ప్రయాణించవచ్చు.
- ఆయన ఉండే ఇంటి అద్దెను జీవితాంతం ప్రభుత్వమే భరిస్తుంది. నేషనల్ రోమింగ్ ఫెసిలిటీతో కూడిన మొబైల్, ఒక కారు కేటాయిస్తుంది.