కార్మిక సంఘం ఎన్నికల్లో కేపీఎస్​ గెలుపు

కార్మిక సంఘం ఎన్నికల్లో కేపీఎస్​ గెలుపు

సదాశివపేట, వెలుగు: మండల పరిధిలోని ఎంఆర్ఎస్​ పరిశ్రమలో బుధవారం జరిగిన కార్మిక సంఘం ఎన్నికల్లో కేపీఎస్​(కార్మిక పోరాట సమితి) విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో గుర్తింపు పొందిన 9 కార్మిక సంఘాలు పోటీ చేయగా కేపీఎస్​పులి గుర్తుకు 584, సీఐటీయూకు 445, బీఎమ్​ఎస్​కు 382, టీఎమ్​టీడబ్ల్యూ కు164 ఓట్లు పడ్డాయి. 

ఇందులో 2 ఓట్లు ఇన్ వ్యాలిడ్​కాగా 139 ఓట్ల మెజారిటీతో కేపీఎస్​విజయం సాధించింది. కార్మికులకు అండగా ఉండి పోరాడుతామని కేపీఎస్​కార్మిక సంఘం అధ్యక్షుడు కొత్తగొల్ల చంద్రశేఖర్​ తెలిపారు. తమ కార్మిక సంఘానికి అత్యధిక ఓట్లు వేసి గెలిపించిన కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు