
సదాశివపేట, వెలుగు: మండల పరిధిలోని ఎంఆర్ఎస్ పరిశ్రమలో బుధవారం జరిగిన కార్మిక సంఘం ఎన్నికల్లో కేపీఎస్(కార్మిక పోరాట సమితి) విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో గుర్తింపు పొందిన 9 కార్మిక సంఘాలు పోటీ చేయగా కేపీఎస్పులి గుర్తుకు 584, సీఐటీయూకు 445, బీఎమ్ఎస్కు 382, టీఎమ్టీడబ్ల్యూ కు164 ఓట్లు పడ్డాయి.
ఇందులో 2 ఓట్లు ఇన్ వ్యాలిడ్కాగా 139 ఓట్ల మెజారిటీతో కేపీఎస్విజయం సాధించింది. కార్మికులకు అండగా ఉండి పోరాడుతామని కేపీఎస్కార్మిక సంఘం అధ్యక్షుడు కొత్తగొల్ల చంద్రశేఖర్ తెలిపారు. తమ కార్మిక సంఘానికి అత్యధిక ఓట్లు వేసి గెలిపించిన కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు