ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రం మధురలోని కృష్ణ జన్మభూమి సమీపంలో రైల్వే అధికారులు అక్రమ నిర్మాణాలు కూల్చివేయడానికి నిర్ణయించారు. ఈ క్రమంలో కొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించగా ధర్మాసం ఆగస్టు 16న విచారించింది.
కూల్చివేతలను 10 రోజులపాటు నిలిపివేయాలని కోర్టు అధికారులను ఆదేశించింది. జస్టిస్ అనిరుద్ధ బోస్, సంజయ్ కుమార్ తో కూడిన ధర్మాసనం కేంద్రానికి, అధికారులకు ఇదే అంశంపై నోటీసులు జారీ చేసింది.
కూల్చివేతలు ఆపాక బాధితుల లిస్ట్ రెడీ చేయాలని ఆదేశించింది. వారి తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. బుల్డోజర్లతో ఇప్పటివరకు 100 ఇళ్లు కూల్చారని, ఇంకో 80 ఇళ్లు మిగిలాయని బాధితులకు న్యాయం చేసి మిగతా ఇళ్లను కూల్చాలని కోర్టుని కోరగా, ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది.