వెల్డన్ శ్రీయాన్.. అభినందించిన కేటీఆర్.. 11 ఏండ్లకే 100కు పైగా కార్టూన్లతో పుస్తకం

వెల్డన్ శ్రీయాన్.. అభినందించిన కేటీఆర్.. 11 ఏండ్లకే 100కు పైగా కార్టూన్లతో పుస్తకం

హైదరాబాద్​సిటీ, వెలుగు: చిన్న వయస్సు నుంచే కార్టూన్లు గీస్తూ 11 ఏండ్లకే 100కి పైగా కార్టూన్లతో బుక్​ పబ్లిష్​చేసిన శ్రీయాన్​ను ఆదివారం బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​కేటీఆర్ అభినందించి, సత్కరించారు. సికింద్రాబాద్ ​మహేంద్ర హిల్స్​కు చెందిన శ్రీయాన్​ బేగంపేట పబ్లిక్ ​స్కూల్​లో ఏడో తరగతి చదువుతున్నాడు.

చిన్నప్పటి నుంచే కార్టూన్లు వేయడంపై ఆసక్తి చూపిస్తున్న ఈ బాలుడు​తాజాగా కార్టూన్లతో ‘బ్రోచేవారెవరురా బ్రో.. నను’  పేరిట బుక్​ తీసుకువచ్చాడు. దాన్ని కేటీఆర్​కు బహూకరించాడు. శ్రీయాన్​తండ్రి రమేశ్​శ్రీరంగం ప్రముఖ మ్యాక్స్​ఫేషియలిస్ట్​కాగా, తల్లి న్యాయవాదిగా ప్రాక్టీస్​చేస్తున్నారు.