వర్షపాతంపై ముఖ్యమంత్రివి అబద్దాలు: కేటీఆర్‌ ట్వీట్​

వర్షపాతంపై ముఖ్యమంత్రివి అబద్దాలు: కేటీఆర్‌ ట్వీట్​

హైదరాబాద్‌: తెలంగాణలో లోటు వర్షపాతం నమోదైంటూ సీఎం రేవంత్​రెడ్డి అబద్దాలు చెప్పారంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌  ట్విట్టర్​ వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు.  భారత వాతావరణ శాఖ  లెక్కల ప్రకారం 2023-–24 సంవత్సరానికి సాధారణం కంటే 14 శాతం ఎక్కువ వర్షపాతం రాష్ట్రంలో నమోదైందని తెలిపారు. నీటి సమస్యలు తీర్చే సామర్థ్యం లేక.. లోటు వర్షపాతమంటూ మాట్లాడటం విడ్డూరంగా ఉందంటూ  ట్వీట్‌ చేశారు.   రైతు సమస్యల పరిష్కారంపై రేవంత్‌ వ్యాఖ్యలు ప్రభుత్వ చేతగాని తనానికి నిదర్శనమన్నారు.

ALSO READ :- ప్రభుత్వ పల్లె దవాఖాన వైద్యుల ఆందోళన