కేటీఆర్​.. నోటిని అదుపులో పెట్టుకో లేదంటే భవిష్యత్​లో మూల్యం చెల్లించక తప్పదు : నిరంజన్​

కేటీఆర్​.. నోటిని అదుపులో పెట్టుకో లేదంటే భవిష్యత్​లో మూల్యం చెల్లించక తప్పదు : నిరంజన్​

హైదరాబాద్, వెలుగు: కేటీఆర్​ నోటిని అదుపులో పెట్టుకోవాలని, లేదంటే భవిష్యత్​లో మూల్యం చెల్లించక తప్పదని పీసీసీ సీనియర్​ వైస్​ ప్రెసిడెంట్​ జి.నిరంజన్​ హెచ్చరించారు. అమరులను బలి తీసుకున్నది సోనియానేనంటూ మాట్లాడడం దారుణమన్నారు. మంగళవారం ఆయన గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు. అధికారమదంతో కన్నూమిన్నూ కానకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కళ్లున్న కబోది కేటీఆర్​అని ఫైర్​ అయ్యారు. సోనియా గాంధీ చొరవతోనే తెలంగాణ వచ్చిందని ప్రపంచమంతా ప్రశంసించిందని గుర్తు చేశారు. చివరకు కేసీఆర్​ కూడా తొలి అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయాన్ని చెప్పారన్నారు.

అమరులను సోనియా బలి తీసుకుంటే తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేసీఆర్​ కుటుంబమంతా సోనియాగాంధీ ఇంటికి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. సీఎం పదవి దక్కదన్న నిరాశతోనే కేటీఆర్​ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. పీసీసీ చీఫ్​ గురించి తీన్​ఫీట్​ అని మాట్లాడుతున్న కేటీఆర్​.. తానేమైనా ఆజానుబాహుడనుకుంటున్నారా అని నిరంజన్​ ప్రశ్నించారు.