
హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ను బద్నాం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ కలిసి కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్ర చేస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక్క వ్యక్తి నిర్ణయం కాదని, కేబినెట్ మొత్తం కలిసి తీసుకున్న నిర్ణయమన్నారు. ఇదే విషయాన్ని గతంలో మంత్రులుగా పనిచేసిన ఈటల రాజేందర్, హరీశ్ రావు కమిషన్ ముం దు స్పష్టం చేశారని పేర్కొ న్నారు. సోమవారం తెలంగాణ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని.. అయితే, ఆచరణలో పెట్టే బాధ్యత అధికారులపై ఉంటుందన్నారు. కాళే శ్వరం ప్రాజెక్టులో ఎలాంటి అవకతవకలు జరగ లేదని, ఈ విషయంలో దాచాల్సిందేమీ లేదని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తమను ఎలాగైనా విసి గించాలన్న ఉద్దేశంతోనే నోటీసులిస్తున్నారని అన్నారు. సోమవారం కమిషన్ ముందు హరీశ్ రావు పూర్తి అంశాలు వివరించారని, కేసీఆర్ కొత్తగా చెప్పేదేమీ ఉండదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తాటాకు చప్పుళ్లకు భయపడమని, ప్రధాని మోదీ దృష్టిలో పడేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.