హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామన్న టీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ సాహసోపేత ప్రకటనపై గతంలో రాజకీయ ప్రత్యర్థులు ఎగతాళి చేశారని మంత్రి కేటీఆర్ అన్నారు. కానీ అదే తెలంగాణ.. నేడు కేసీఆర్ సారథ్యంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని ఆయన ట్వీట్ చేశారు. ‘మొదట నిన్ను పట్టించుకోరు.. ఆ తర్వాత నిన్ను చూసి నవ్వుతారు. ఆపై నీతో గొడవ పడతారు. అంతిమ విజయం నీదే’ అనే గాంధీ మాటలను ఈ ట్వీట్ లో కేటీఆర్ గుర్తు చేశారు. 2001లో కేంద్రానికి దారికి తెచ్చి.. తెలంగాణ సాధిస్తామని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై చాలా రాజకీయ పార్టీలు విమర్శలకు దిగాయన్నారు. కానీ కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకెళ్తోందని పేర్కొన్నారు.
First, they ignore you,
— KTR (@KTRTRS) February 12, 2022
Then they laugh at you,
Then they fight you,
Then you win! - Mahatma Gandhi
The audacious statement of #KCR Garu from May, 2001 was mocked by many political opponents
But today the state of #Telangana stands tall in India under his able leadership ? pic.twitter.com/vNk0veJiaa
మరిన్ని వార్తల కోసం: