
- పార్టీ నేతలు,కేడర్కు కేటీఆర్ సూచన
- బ్రిటన్, అమెరికాకు పయనం
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఆవిర్భావ వేడుకలను తెలంగాణ భవన్తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని నేతలు, కేడర్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. తెలంగాణ భవన్లో శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి జాతీయ పతాకం, పార్టీ జెండాను ఆవిష్కరిస్తారని మంగళవారం ఓ ప్రకటనలో కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో సంబరాలు జరపాలని కోరారు.
కాగా.. బ్రిటన్, అమెరికాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కేటీఆర్ విదేశాలకు వెళ్లారు. మంగళవారం సాయంత్రం ఆయన లండన్ చేరుకున్నారు. అక్కడ బ్రిడ్జ్ ఇండియా ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించనున్న ఇండియా వీక్ 2025 కార్యక్రమంలో పాల్గొననున్నారు. అలాగే జూన్ 1, 2న అమెరికాలో నిర్వహించనున్న వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.