ఉచిత విద్యుత్ పై రేవంత్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి తీసేస్తామన్న రాబందు..ఇవాళ 3 గంటల కరెంట్ చాలంటున్నాడని ధ్వజమెత్తారు. నాడు చంద్రబాబు వ్యవసాయం దండగంటే.. ఇవాళ ఛోటా చంద్రబాబు మూడు పూటల కరెంట్ దండగంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడెకరాల రైతుకు మూడు పూటలా కరెంట్ ఎందుకనడం ముమ్మాటికీ సన్న, చిన్న కారు రైతును అవమానించడమేనని అన్నారు. కాంగ్రెస్ కు చిన్న ,సన్నకారు రైతులంటే చిన్నచూపన్నారు.
నోట్లు తప్ప..రైతుల పాట్లు తెలియని రేవంత్ ను నమ్మితే రైతు నోట్లో మట్టి కొట్టుడు ఖాయమని ధ్వజమెత్తారు కేటీఆర్. నాడు ఏడుగంటల కరెంట్ ఇవ్వకుండా ఎగ్గొట్టినా కాంగ్రెస్ నేడు ఉచిత కరెంట్ కు ఎగనామం పెట్టే కుట్ర చేస్తోందన్నారు. 3 ఎకరాల పొలం పారించాలంటే బక్కచిక్కిన రైతు బాహుబలి మోటార్లు పెట్టాలన్నారు.అరికాలిలో మెదడు ఉన్నోళ్లను నమ్మితే రైతుల బతుకు ఆగమైతదన్నారు. మరోసారి రాబందు 3 గంటల మాటెత్తితే రైతుల చేతిలో మాడు పగలడం ఖాయమని హెచ్చరించారు.
మూడు పంటలు కేసీఆర్ నినాదమని..కాంగ్రెస్ విధానం మూడు గంటలు, మతం పేరిట మంటలని ధ్వజమెత్తారు. మూడు పంటాలు కావాలా.. మూడు గంటలు కావాలా.. మతం పేరిట మంటలు కావలో తెలంగాణ రైతులు తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు కేటీఆర్. రైతును రాజును చేసే మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలా ?.. 3 గంటలు చాలన్న మోసకారి రాబందు కావాలా ? అని ప్రశ్నించారు.