
ధనుష్, నాగార్జున లీడ్ రోల్లో శేఖర్ కమ్ముల రూపొందించిన చిత్రం ‘కుబేర’. రష్మిక హీరోయిన్. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు కలిసి నిర్మించిన ఈ చిత్రం జూన్ 20న పాన్ ఇండియా వైడ్గా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు రాజమౌళి ఈ మూవీ ట్రైలర్ను లాంచ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘శేఖర్ కమ్ముల ఆయన నమ్మిన సిద్ధాంతాల మీదే సినిమాలు తీస్తారు. ఇది కూడా అలాంటి చిత్రమే. రిచ్ ప్రపంచాన్ని, పూర్ ప్రపంచాన్ని ఎలా కలిపాడు, ధనుష్, నాగార్జున గారిని ఎలా చూపించారు అనేది ఎక్సయిటింగ్గా ఉంది’ అని అన్నారు.
ధనుష్ మాట్లాడుతూ ‘శేఖర్ కమ్ముల గారు సెన్సిబుల్ డైరెక్టర్. ఆయనతో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్పీరియెన్స్. నాగార్జున గారితో స్ర్కీన్ షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. రష్మికది అమెజింగ్ జర్నీ. టీమ్ అందరి హార్డ్ వర్క్తోనే ఈ ప్రాజెక్ట్ సాధ్యమైంది. అందరూ ఎంజాయ్ చేసేలా ఈ సినిమా ఉంటుంది’ అని చెప్పారు. నాగార్జున మాట్లాడుతూ ‘ధనుష్తో వర్క్ చేయడం ఫెంటాస్టిక్ ఎక్స్పీరియెన్స్. ఆయనతో నటించడం చాలా హ్యాపీగా ఉంది. ఇది శేఖర్ కమ్ముల ఫిల్మ్. ఇందులో మేమంతా పాత్రధారులం మాత్రమే. ఆయనతోపాటు మమ్మల్ని కూడా కంఫర్ట్ జోన్లో నుంచి బయటికి తీసుకొచ్చిన సినిమా ఇది. కచ్చితంగా సక్సెస్ అవుతుందని నమ్ముతున్నా’ అని అన్నారు.
రష్మిక మాట్లాడుతూ ‘శేఖర్ గారు రియల్ ఎమోషన్స్తో మూవీస్ తీస్తారు. ఆయన డైరెక్షన్లో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్పీరియెన్స్. నాగ్ సర్, ధనుష్ సర్తో వర్క్ చేయడం వెరీ హ్యాపీ’ అని చెప్పింది. శేఖర్ కమ్ముల మాట్లాడుతూ ‘తల్లిప్రేమ లాంటి చిత్రమిది. బిచ్చగాడికైనా, కోటీశ్వరుడికైనా తల్లిప్రేమ ఒక్కటే అని ఇందులో చూపించబోతున్నాం. అలాగే దేవుడికి, దేశానికి కూడా అందరూ ఒకటే అని ఐడియాను చూపిస్తున్నాం. సర్వస్వతీ దేవి తలెత్తుకుని చూసేలా సినిమా ఉంటుంది. చాలా కొత్తగా, ఫ్రెష్గా ఉంటుంది’ అని చెప్పారు. నిర్మాత పుస్కూర్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ ‘శేఖర్ కమ్ముల గారి స్టైల్ ఆఫ్ టేకింగ్ను 25 ఏళ్లుగా చూస్తున్నాం. డిఫరెంట్ జానర్లో ఈ చిత్రాన్ని రూపొందించారు.
ధనుష్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్సర్. నాగార్జున గారి యాక్టింగ్ నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. రష్మిక గారి లక్ మాకు కూడా కలిసొస్తుందని నమ్ముతున్నా. దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఈ చిత్రం అందరికీ నచ్చేలా ఉంటుంది’ అని అన్నారు. నిర్మాతలు సునీల్ నారంగ్, భరత్ నారంగ్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ పద్మశ్రీ తోట తరణి, లిరిక్ రైటర్స్ భాస్కర భట్ల, నంద కిశోర్ తదితరులు పాల్గొన్నారు.