గచ్చిబౌలి, వెలుగు: గచ్చిబౌలి బొటానికల్ గార్డెన్ వద్ద ఆరేండ్ల క్రితం దారుణ హత్యకు గురైన నిండు గర్భిణి పింకీ మర్డర్కేసులో శుక్రవారం కూకట్పల్లి కోర్టు నలుగురు నిందితులకు జీవిత ఖైదు, ఒక్కొక్కరికి పది వేల చొప్పున జరిమానా విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. కేసు వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ర్టానికి చెందిన బింగి అలియాస్ పింకీ(38), దినేశ్ భార్యాభర్తలు.
పింకీకి అదే గ్రామానికి చెందిన వికాస్ కశ్యప్(32)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. వికాస్ కశ్యప్, పింకీ 2017లో పింకీ తన రెండో కుమారుడు జతిన్తో కలిసి పింకీ బిహార్లోని తన సొంత గ్రామం వచ్చి సహజీవనం చేశారు. ఈ సమయంలో వికాస్ కశ్యప్కు పింకీ గ్రామానికి చెందిన మమతా ఝా(36) తో వివాహేతర సంబంధం ఏర్పడింది. మమతా వీరి ఇంటికి సమీపంలోనే తన భర్త అనిల్ ఝా(60), కుమారుడు అమర్కాంత్ ఝాలతో నివాసం ఉండేది. మమతతో ఏర్పడిన అక్రమ సంబంధం నేపథ్యంతో వికాస్, పింకీల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. దీంతో మమత తన కుమారుడు అమర్కాంత్ తోడుగా వికాస్ను ఉపాధి నిమిత్తం హైదరాబాద్కు పంపించింది. కొన్ని రోజుల తర్వాత మమత, ఆమె భర్త అనిల్నగరానికి వచ్చి, మాదాపూర్ సిద్ధిక్నగర్లో ఇండ్లు అద్దెకు తీసుకొని నివాసం ఉన్నారు. వికాస్ జాడ తెలుసుకున్న పింకీ 2018 జనవరిలో హైదరాబాద్కు వచ్చి వికాస్తో పాటు గదిలో నివాసం ఉండసాగింది. అప్పటికే పింకీ 8 నెలల గర్భిణీ.
పింకీ నగరానికి వచ్చి వీరితో ఉంటుండడంతో మమత, వికాస్ అక్రమ సంబంధానికి అడ్డుగా మారింది. ఎలాగైనా ఆమెను చంపాలని పథకం వేశారు. 2018 జనవరి27వ తేదీన మమత, వికాస్, అనిల్, అమర్కాంత్లు పింకీని దారుణంగా హత్య చేసి, ఎలక్ర్టికల్ కట్టర్తో పింకీ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి గోనె సంచిలో కుక్కారు. ఆ తర్వాత గోనె సంచిని బైక్పై బొటానికల్ గార్డెన్ రోడ్డులోకి తీసుకువచ్చి రహదారి పక్కన పడేశారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ మర్డర్ కేసులో నలుగురు నిందితులను అదే సంవత్సరం ఫిబ్రవరి 12న అరెస్ట్ చేశారు.
ఆరేండ్ల తర్వాత శిక్ష...
పింకీ మర్డర్ కేసు ఆరేండ్లుగా కూకట్పల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ ఆరేండ్ల కాలంలో నిందితులు 18 సార్లు బెయిల్ కోసం పిటిషన్లు వేయగా కోర్టు కొట్టేసింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి ఆధారాలు, ఎవిడెన్స్లను గచ్చిబౌలి పోలీసులు కోర్టుకు సమర్పించి, చార్జ్షీట్ దాఖలు చేశారు. దీంతో కూకట్పల్లి కోర్టు నలుగురు నిందితులకు జీవిత కాలం జైలు శిక్ష, ఒక్కొక్కరికి పది వేల చొప్పున ఫైన్ విధిస్తూ తీర్పు వెల్లడించింది.