ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ కానున్న కుమారస్వామి

ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ కానున్న కుమారస్వామి
  • నేడు సీఎం కేసీఆర్‌తో కుమారస్వామి భేటీ
  • జాతీయ రాజకీయాలపై చర్చ

హైదరాబాద్‌, వెలుగు : కర్నాటక మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి ఆదివారం హైదరాబాద్‌కు రానున్నారు. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో ఆయన భేటీ కానున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో కర్నాటక అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కుమారస్వామి, కేసీఆర్‌ మధ్య జాతీయ రాజకీయాలపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశముందని ప్రగతి భవన్‌ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ ఈ నెల 25న ఢిల్లీకి వెళ్లే అవకాశముందని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. మాజీ డిప్యూటీ ప్రైమ్‌ మినిస్టర్‌ దేవిలాల్‌ స్మారకార్థం, ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌ చీఫ్‌ ఓం ప్రకాశ్‌ చౌతాలా ఆధ్వర్యంలో సమ్మాన్‌ దివస్‌ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి కేసీఆర్​ హాజరయ్యే అవకాశం ఉంది.