రెండేళ్లు జైలుకెళ్లినా మారలే..పాత నేరస్తుడు మళ్ళీ అరెస్ట్

రెండేళ్లు జైలుకెళ్లినా మారలే..పాత నేరస్తుడు మళ్ళీ అరెస్ట్

ఎల్​బీనగర్, వెలుగు :  వరుస చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని కుషాయిగూడ పొలీసులు అరెస్ట్ చేశారు. శనివారం ఎల్​బీనగర్​లోని రాచకొండ సీపీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ సుధీర్ బాబు వివరాలు వెల్లడించారు. కుషాయిగూడ మార్కెట్ సమీపంలో ఉంటున్న కొంతం సాయికిరణ్ రెడ్డి(23) జల్సాలకు బానిసై ఈజీ మనీ కోసం చోరీలకు స్కెచ్ వేశాడు. 2021లో  నార్సింగి పీఎస్ పరిధిలో జరిగిన ఓ చోరీ కేసులో సాయికిరణ్ ను పోలీసులు అరెస్ట్ చేయగా.. కోర్టు అతడికి రెండేళ్ల జైలు శిక్ష విధించింది.

రెండేళ్ల తర్వాత గతేడాది జులైలో చర్లపల్లి జైలు నుంచి రిలీజై బయటికి వచ్చిన సాయికిరణ్ మళ్లీ చోరీలు మొదలుపెట్టాడు. వెంకట్ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో చోరీ చేశాడు. రూ19 లక్షల 50 వేల విలువైన బంగారు నగలు, 2 సెల్​ఫోన్లను ఎత్తుకెళ్లాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాయికిరణ్​ను అరెస్ట్ చేశారు. బంగారు నగలు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్​కు తరలించారు.