దక్షిణాది సినీ ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి ఖుష్బూ. ఈ నటి తన కుమార్తె అవంతికను సినీ రంగంలోకి పరిచయం చేసేందుకు సిద్ధం చేస్తుంది. గత కొంతకాలంగా అభిమా సులు అవంతిక ఎప్పుడు అరంగేట్రం చేస్తుందోనని ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వారికి కోరిక ఫలించింది.
తాజాగా అవంతిక మలయాళ మూవీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. సుజేష్ దర్శకుడు. కేరళలోని త్రిసూర్ లో పూజా కార్యక్రమాలతో మూవీ షూటింగ్ ప్రారంభమయ్యింది. ఈ మూవీ మలయాళంలో రూపొందుతోన్నప్పటికీ, తమిళ ప్రేక్షకుల కోసం కూడా విడుదల కానుంది. ఇతర ముఖ్య పాత్రల్లో సరిత, అల్తాఫ్ సలీమ్, ఇంద్రన్స్, విజయరాఘవన్, కృష్ణ శంకర్, కళాభవన్ షాజోన్, సునీల్ సుగత, వీటి వెంకటేష్, నోబీ మార్కోస్, రాజేష్ శర్మ రమేష్ కొట్టాయం తదితరులు నటిస్తున్నా రు.
తన కుమార్తె ఇరంగేట్రానికి సంబంధించిన ఆనందాన్ని ఖుష్బూ సోషల్ మీడియా వేదికగా అభి మానులతో పంచుకున్నాడు. అవంతిక ఫొటోషూట్ లో పాల్గొన్న ఫొటోలు వెల్లడికావడం తో, ఆమె సినీ రంగంలో ఎంట్రీ ఇచ్చేసిందని స్పష్ట మైంది. తనను ఆదరించినట్లే తన కుమార్తెను ఆదరించాలని అభిమానులను కోరుతుంది.
