తిరువనంతపురం: కేరళలో వలసకార్మికులు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణ నెలకొంది. ఒరువతి కొట్టాలో 700 మంది వలస కార్మికులు తమను సొంతూళ్లకు పంపించేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే పోలీసులు వలస కార్మికులన ఆందోళన విరమించేలా నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు.
కార్మికులు ఒక్కసారిగా పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. వారిని హాస్పిటల్ కి తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్నట్లు తెలిపారు ఉన్నతాధికారులు.