- నంగార బేరి లంబాడి హక్కుల పోరాట సమితి
ఖైరతాబాద్, వెలుగు: అధికారాన్ని అడ్డుపెట్టుకొని అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావును విధుల నుంచి తొలగించాలని నంగారా బేరి లంబాడి హక్కుల పోరాట సమితి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. లేకపోతే ఈ నెల 30న ఎస్టీ సంఘాల అధ్వర్యంలో ప్రగతిభవన్ను ముట్టడిస్తామని హెచ్చరించింది. బుధవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్ నాయక్, ఆదివాసీ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ వాసం రామకృష్ణ దొర, బీసీ మహిళా నాయకురాలు ప్రసన్న మాట్లాడారు.
రాష్ట్రంలోని జనాల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన కీలక పదవిలో ఉన్న హెల్త్ డైరెక్టర్ తన బాధ్యతను మరిచి బీఅర్ఎస్ పార్టీ ఏజెంట్లా మారారని విమర్శించారు. న్యాయంగా గిరిజనులకు రావాల్సిన ఉద్యోగాలు, పదోన్నతులను ఇతరులకు అప్పగించారని ఆరోపించారు. అవినీతి అధికారి శ్రీనివాస్పై విచారణ చేపట్టాలన్నారు.