HMDA అధికారులపై కబ్జాదారుల దాడి

HMDA అధికారులపై కబ్జాదారుల దాడి

భూమి సర్వే చేయడానికి వచ్చిన హెచ్ఎండిఏ అధికారులపై భూకబ్జాదారులు దాడికి పాల్పడిన ఘటన శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. శంషాబాద్ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 725/21,23/24లలో 108 ఎకరాల హెచ్ఎండిఏ భూమి ఉండగా.. ఈ భూమిని ప్రభుత్వావసరాల కోసం గతంలో భూసేకరణ చేసింది. అప్పటినుండి ఈ భూమిని ప్రభుత్వం ఆధీనంలో ఉంది. 

అయితే, ఈ భూమిని హెచ్ఎంటీ అధికారులు ఎడీ సర్వే చేయడానికి సైట్ వద్దకు రాగా.. అక్కడ ఆ భూమిని ఆక్రమించిన కొంతమంది రేకులతో ప్రహరీ గోడ ఏర్పాటు చేసుకున్నారు. దీంతో హెచ్ఎంటీ అధికారులు రేకులు తొలగించి కబ్జా దారులపై ఆగ్రమం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో భూకబ్జాదారులకు అధికారుల మధ్య వాగ్వాదం ఏర్పడింది. దీంతో భూ కబ్జాదారులు అధికారులపై రాళ్ల దాడి చేసి జేసీబీలను పగులగొట్టారు. హెచ్ఎండిఏ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఈ విషయంపై హెచ్ఎండీఏ అధికారులను వివరణ కోరగా.. వివరాలు ఇవ్వడానికి నిరాకరిస్తూ..  విషయాన్ని దాటవేసే ప్రయత్నం చేశారు అధికారులు.