న్యూఢిల్లీ: దేశంలో, విదేశాల్లోనూ కలిపి రూ. 2,500 కోట్ల విలువైన ఆర్డర్లను దక్కించుకున్నామని లార్సెన్ అండ్ టుబ్రో (ఎల్ అండ్ టీ) ప్రకటించింది. ఎల్ అండ్ టీ కన్స్ట్రక్షన్కు చెందిన పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ (ఈపీసీ) సెగ్మెంట్లో ఈ ఆర్డర్లు పొందింది.
సౌదీ అరేబియాలో 380 కేవీల పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్ను ఏర్పాటు చేయడానికి, ఇక్కడే సెంట్రల్ రీజియన్లో 380కేవీ సబ్స్టేషన్ను డిజైన్, నిర్మించడానికి ఆర్డర్లు పొందామని ఎల్ అండ్ టీ ఓ స్టేట్మెంట్లో పేర్కొంది. ఇండియాలో గుజరాత్ సదర్న్ రీజియన్లో డిస్ట్రిబ్యూషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేసేందుకు ఆర్డర్ దక్కించుకున్నామని వివరించింది. రూ.2,500 కోట్ల నుంచి రూ.5 వేల కోట్ల విలువైన ఆర్డర్లను మెగా ఆర్డర్లుగా కంపెనీ పిలుస్తోంది.