హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎల్ఎల్ బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం గురువారం నిర్వహించిన లాసెట్ ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది. మూడు సెషన్లలో జరిగిన పరీక్షకు 83 శాతం మంది హాజరయ్యారని లాసెట్ కన్వీనర్ విజయలక్ష్మీ తెలిపారు. మూడేండ్ల ఎల్ఎల్బీ కోర్సు కోసం జరిగిన పరీక్షకు ఫస్ట్ సెషన్లో 15,742 మందికి గానూ 12,799 మంది, సెకండ్ సెషన్లో 15,743 మందికిగాను.. 12,948 మంది ఎగ్జామ్ రాశారు.
ఐదేండ్ల ఎల్ఎల్బీ కోర్సుకు, ఎల్ఎల్ఎంకు 12,207 మందికి గానూ.. 10,471 మంది హాజరయ్యారు. ఈ నెల29న https://lawcet.tsche.ac.in వెబ్ సైట్లో ప్రిలిమినరీ కీ పెడ్తామని, 31న సాయంత్రం 5గంటల లోపు అభ్యంతరాలు తెలియజేయాలని అధికారులు సూచించారు.