కేసీఆర్ మాట ఇస్తే కాస్త ఆలస్యం అయినా చేస్తరు: సుధీర్ రెడ్డి

కేసీఆర్ మాట ఇస్తే కాస్త ఆలస్యం అయినా చేస్తరు: సుధీర్ రెడ్డి

ఆర్యవైశ్య కార్పొరేషన్ ఇవ్వలేదని ఎవరూ బాధపడొద్దన్నారు ఎల్బీనగర్ ఎమ్మెల్సీ సుధీర్ రెడ్డి.  కేసీఆర్ మాట ఇస్తే కాస్త ఆలస్యం అయినా చేస్తారని చెప్పారు. సరూర్ నగర్ స్టేడియంలో  వైశ్య గర్జన సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడిన సుధీర్ రెడ్డి.. వైశ్యుల డిమాండ్లను  తాము కూడా సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్పొరేషన్ లో సీట్లు వైశ్యులకు వచ్చే విదంగా చర్యలు తీసుకుంటామన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు  కూడా పేద వైశ్యులకు వచ్చే విదంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఆర్యవైశ్యలో చైతన్యం తీసుకురావడానికి తాము ఎంతో  కృషి చేశామన్నారు  వైశ్య వికాస వేదిక ఫౌండర్, చైర్మన్ కాచం సత్యనారాయణ. వైశ్య బిడ్డలను అవహేళన చేయకుండా ఉండాలంటే వైశ్య కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ, ఎమ్యెల్యే గా ఉన్న వైశ్య నాయకులను సభకు పిలిచాము...కానీ రాలేదన్నారు.  జనాభా దామాషా ప్రకారం రాజకీయాల్లో వైశ్యులకు  వాటా కల్పించాలన్నారు. - వైశ్య బందును ప్రారంభించాలని. -  - వైశ్య ఉమెన్ ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.