కొత్త ఎలక్ట్రిక్ బైక్..8 ఏళ్ల బ్యాటరీ వారెంట్

 కొత్త ఎలక్ట్రిక్ బైక్..8 ఏళ్ల బ్యాటరీ వారెంట్

ఢిల్లీ: ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ ఓలా.. కొత్త ఎలక్ట్రిక్ బైక్ ను పరిచయం చేసింది. ఎస్‌1 ఎక్స్‌ 4 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ మోడల్ ను తీసుకువచ్చింది. రూ.1.10లక్షలకే ఈ బైక్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. దీన్ని ఒక్కసారి ఫుల్‌  ఛార్జ్ చేస్తే.. 190 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయొచ్చని వెల్లడించింది.

ఛార్జింగ్‌ పెట్టేందుకు 6 గంటల 30 నిమిషాల సమయం పట్టనుందని.. టాప్‌ స్పీడ్‌ 90 కేఎంపీఎహెచ్‌ వరకు ప్రయాణం చేయొచ్చని ఓలా తెలిపింది.  అయితే ఇక్కడ అదిరిపోయే న్యుస్ ఒకటి ఓలా అందించింది. 8 ఏళ్ల వరకు ఎక్స్‌ టెండెండ్‌ బ్యాటరీ వారెంటీని ఉచితంగా అందిస్తున్నట్లు పేర్కొంది.

ఈ సదుపాయం అన్నీ వాహనాలకు వర్తిస్తుందని వివరించింది. ఓలా ఎస్‌1 ఎక్స్‌ 4 కేడబ్యూహెచ్‌ డెలివరీలు ఏప్రిల్ నుంచి ప్రారంభమవుతాయని వివరించింది. ఓలా ఎస్1 ఎక్స్‌  రెడ్ వెలాసిటీ, మిడ్‌నైట్, వోగ్, స్టెల్లార్, ఫంక్, పోర్సిలైన్ వైట్, లిక్విడ్ సిల్వర్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉండనుంది.