ముషీరాబాద్, వెలుగు: ప్రభుత్వాలు ప్రజలపై ధరల భారాన్ని మోపుతూ, కార్పొరేట్ రంగానికి ఊడిగం చేస్తున్నాయని లెఫ్ట్ పార్టీల నాయకులు ఆరోపించారు. శ్రీలంక తరహాలో ప్రజలు తిరగబడే పరిస్థితులు వస్తాయన్నారు. ప్రజలపై ధరలు, పన్నుల భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. ఓ వైపు బీజేపీని వ్యతిరేకిస్తూనే కేంద్ర ప్రభుత్వ పాలసీలను టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తోందని మండిపడ్డారు. ధరలు, పన్నుల భారాలకు వ్యతిరేకంగా లెఫ్ట్ పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్లోని ధర్నాచౌక్ లో మహాధర్నా నిర్వహించారు. ధర్నాలో సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మాట్లాడారు. ప్రధాని మోడీ కార్పొరేట్ కంపెనీల కోసం పనిచేస్తున్నారని విమర్శించారు. పెరిగిన ధరల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు మతవిధ్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వీరయ్య మాట్లాడారు. అదానీ, అంబానీ కోసం మోడీ ప్రభుత్వం దేశాన్ని కొల్లగొడుతోందని దుయ్యబట్టారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక వినతిపత్రం ఇచ్చే పరిస్థితులూ లేవని సీపీఐ(ఎం-ఎల్) న్యూడెమొక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వర్ రావు అన్నారు. రాష్ట్ర నేత ఝాన్సీ మాట్లాడుతూ ప్రభుత్వ విధానాల వల్లే రాష్ట్రంలో పరువు హత్యలు అవుతున్నాయన్నారు. సీపీఐ (ఎం-ఎల్) ప్రజాపంథా రాష్ట్ర నేత కె.రంగయ్య మాట్లాడుతూ.. కేంద్ర తప్పుడు విధానాలతోనే ప్రజలపై ధరల భారం పడిందన్నారు.
ప్రభుత్వాలు ప్రజలపై ధరల భారాన్నితగ్గించాలి
- హైదరాబాద్
- June 1, 2022
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- CSK vs SRH: చెన్నై విశ్వరూపం.. వరుసగా రెండో మ్యాచ్లోనూ సన్ రైజర్స్ ఘోర ఓటమి
- RCB vs GT: క్రిస్ గేల్ ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టిన విల్ జాక్స్
- Electric Air Taxi : బైక్,ఆటో, కారు ట్యాక్సీలేనా..విమాన ట్యాక్సీలూ వచ్చేస్తున్నాయోచ్..
- కాంగ్రెస్ హామీలను అమలు చేయలేకపోతుంది: జగదీష్ రెడ్డి
- మళ్లీ మోదీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తడు : సీఎం రేవంత్ రెడ్డి
- కలికాలం.. రోబోతో ప్రేమలో పడ్డ ఇంజనీర్... పెళ్లి కూడా చేసుకుంటాడట..
- Indian 2 Audio Launch: ఇండియన్ 2 ఆడియో లాంఛ్కు ఇద్దరు స్టార్ హీరోలు..రెండు కళ్లు చాలవు!
- CSK vs SRH: గైక్వాడ్ సెంచరీ మిస్.. సన్ రైజర్స్ ముందు ఛాలెంజింగ్ టార్గెట్
- బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మే నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్
- కడియం శ్రీహరి తన రాజకీయ జీవితాన్ని భూస్థాపితం చేసుకుండు: కేసీఆర్
Most Read News
- వార ఫలాలు (సౌరమానం) ఏప్రిల్ 28 నుంచి మే 04 వరకు
- మీనరాశిలోకి బుధుడు.. శుక్రుడు మేషరాశిలో సంచారం.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..
- వెదర్ రిపోర్ట్.. ఈ రాష్ట్రాల్లో వర్షాలు
- భారత్ లోని యువ జంటల్లో డింక్ సంస్కృతి
- కథ : నాన్నకి కూతురే ఎందుకు ఇష్టం
- బొద్దింకలు ఇంట్లోకి ఎందుకు వస్తాయి.. ఎలా అడ్డుకోవాలో తెలుసా..
- ఇది సామాన్యుడి బైక్.. ధర తక్కువ.. మైలేజీ ఎక్కువ.. 160 కి.మీ@ రూ.70 వేలు
- జుట్టుకు నూనె పెట్టాలా? వద్దా..హెయిర్ ఎక్స్పర్ట్స్ ఏం చేప్తున్నారు?
- కవర్ స్టోరీ : చాలామంది కపుల్స్ పిల్లలు వద్దంటున్నరు!
- మహాద్భుతం: తిరుమల తిరుపతి దేవాలయం రహస్యాలు ఇవే..