రిపబ్లిక్ డే రోజు రాజ్యాంగ నిర్మాతకు అవమానం.. స్వయంగా కేంద్రమంత్రి ఆయనను విస్మరించడం.. రిపబ్లిక్ వేడుకల్లో ప్రసంగిస్తున్న కేంద్ర మంత్రిని అడ్డుకొని మరీ నిలదీసిన మహిళా అధికారి.. నాసిక్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో బాబా సాహెబ్ అంబేద్కర్ కు జరిగిన అవమానాన్ని ఫారెస్ట్ మహిళా అధికారిని ప్రశ్నించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశమైంది.
మహారాష్ట్రలోని నాసిక్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో సోమవారం (జనవరి 26) జరిగిన ప్రధాన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. జెండా వందన జరిగిన కొద్ది సేపటికే ఋ ఘటన జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన కేంద్ర మంత్రి గిరీష్ మహాజన్ తన ప్రసంగంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరును ప్రస్తావించకపోవడంపై అక్కడే ఉన్న ఫారెస్ట్ డిపార్టుమెంట్ మహిళా పోలీస్ అధికారిణి మాధురి జాదవ్ తీవ్రంగా తప్పుబట్టారు. కేంద్ర మంత్రి ప్రసంగాన్ని అడ్డుకొని బాబా సాహెబ్ అంబేద్కర్ పేరును ఎందుకు ప్రస్తావించలేదని నిలదీశారు.
కేంద్ర మంత్రి ప్రసంగిస్తుండగానే..సీటులోంచి లేచి స్టేజీ దగ్గరకు వెళ్లి మంత్రి ప్రశ్నించారు మాధురి జాదవ్. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. మాధురి జాదవ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
►ALSO READ | 77వ రిపబ్లిక్ డే సందర్భంగా.. భారత్ అంతరిక్ష విజయాలతో గూగుల్ డూడుల్
ఆ వీడియోలో..మాధురీ జాదవ్ తన నిరసను బలంగా వినిపించింది.అవసరమైతే తాను సస్పెన్షన్ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నానని..కానీ మౌనంగా మాత్రం ఉండనని, సమానత్వం,న్యాయం పై రాజ్యంగ విలువలు బీఆర్ అంబేద్కర్ రచనలుంచే వచ్చాయని.. గణతంత్ర దినోత్సవం రోజున ఆయన పేరును ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించినట్లు వినబడుతోంది.
అయితే ఈ వివాదం పై స్పందించిన కేంద్ర మంత్రి గిరీష్ మహాజన్ వివరణ ఇచ్చారు. తాను బీఆర్ అంబేద్కర్పేరు ప్రస్తావించకపోవడం అనుకోకుండా జరిగిందని , ఉద్దేశపూర్వకంగా కాదని స్పష్టం చేశారు.
