
- వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు స్కూళ్లు, కాలేజీల్లోని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వామపక్ష విద్యార్థి సంఘాలు (ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్ యూ, ఏఐడీఎస్ఓ, ఏఐపీఎస్ యూ, ఏఐఎఫ్ డీఎస్, ఏఐఎస్బీ) స్కూళ్లు, జూనియర్ కాలేజీల బంద్కు పిలుపునిచ్చాయి.
మంగళవారం హిమాయత్ నగర్లో విద్యార్థి సంఘాల నేతలు సమావేశమై, బంద్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలన్నారు.