ఐటీ దాడులకు పక్కా రుజువులున్నయ్: జైట్లీ

ఐటీ దాడులకు పక్కా రుజువులున్నయ్:  జైట్లీ

న్యూఢిల్లీ : ఇన్‌ కంటాక్స్‌‌‌‌ దాడులు సహజంగానే జరుగుతున్నా యని, వాటి వెనక ఎలాంటి దురుద్దేశాలూ లేవని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ స్పష్టం చేశారు. ఇన్‌ కంటాక్స్‌‌ ‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ తనకున్నసమాచారం ఆధారంగానే దేశవ్యాప్తంగా వివిధ వ్యక్తులు, సంస్థల మీద దాడులు నిర్వహిస్తోందని చెప్పారు. సరైన ఆధారాలు దొరకడం వల్లే డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ సోదాలు నిర్వహిస్తోందన్నా రు. ఐటీ దాడుల వెనక రాజకీయ కారణాలున్నా యనే ఆరోపణలను ఆయన ఖండించారు. మధ్యప్రదేశ్‌‌‌‌ ముఖ్యమంత్రి కమల్‌‌‌‌నాథ్‌ అనుచరులు, తమిళనాడులోడీఎంకే సీనియర్‌‌‌‌ నాయకులు, కర్నాటకలో జేడీ (ఎస్‌‌‌‌)మంత్రితోపాటు, ఆంధ్రప్రదేశ్‌‌‌‌లో తెలుగుదేశం పార్టీనాయకుల మీద ఐటీ దాడులు జరిగాయి.దేశంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో హవాలా మార్గంలో భారీగా డబ్బుచేతులు మారుతోందన్న సమాచారం ఆధారంగానే ఐటీ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఆసోదాలను నిర్వహించిందని చెబుతున్నారు. ఐతే, కాంగ్రెస్‌‌‌‌ సహాప్రతిపక్షాలు మాత్రం రాజకీయ దురుద్దేశాలతోనే ఐటీదాడులు జరుపుతున్నారని ఆరోపిస్తున్నా యి.

ఈ ఐటీదాడులను దృష్టిలో పెట్టుకున్న ఎలెక్షన్‌ కమిషన్  తాజాగా రెవెన్యూ సెక్రటరీ అజయ్‌ భూషణ్‌ పాండేకు సూచనలు జారీ చేసింది. ఎన్నికల సమయంలోజరిపే సోదాలలో ఎలాంటి పక్షపాతం పనికిరాదని,అందరినీ సమానంగానే చూడాలని ఆ లేఖలో ఎలక్షన్‌ కమిషన్‌ హితవు చెప్పింది. అంతేకాకుండా, ఎలక్షన్‌ కమిషన్‌ కు కూడా ఆయా సోదాల సమాచారం ముందుగానే అందించాలని నిర్దేశించింది. అవినీతికి వ్యతిరేకంగా తీసుకునే చట్టబద్దమైన చర్యల మీద బురద జల్లడం సమంజసం కాదని అమెరికా పర్యటనలో ఉన్న అరుణ్‌ జైట్లీ ఒక ఫేస్‌‌‌‌బుక్‌‌‌‌ పోస్ట్‌‌‌‌ పెట్టారు.ఐఎంఎఫ్‌‌‌‌, వరల్డ్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌  మీటింగ్‌ లో పాల్గొ నేందుకుజైట్లీ అమెరికా పర్యటిస్తున్నా రు. అవినీతికి వ్యతిరేకంగా చేపట్టే ప్రతి చర్యకూ రాజకీయ కారణాలున్నాయంటూ విమర్శించడం అలవాటై పోయిందని వ్యాఖ్యానించారు. అవినీతిని సమర్ధించు కోవడానికే ఇలాంటి వాదనలు చేస్తున్నారంటూ ప్రతిపక్షాల మీద తిప్పికొట్టారు జైట్లీ.

బీజేపీ అధికారంలోలేని మధ్యప్రదేశ్‌‌‌‌, కర్నాటక రాష్ట్రాలు రెం డూ ఇలాంటి ఆరోపణలకు పాల్పడుతున్నాయన్నారు. తమ ప్రత్యర్ధుల మీద కాకుండా, తమ మీద మాత్రమే దాడులుజరుగుతున్నాయంటూ వాదిస్తున్నాయని జైట్లీ ప్రస్తావించారు. సరయిన కారణాలను చెప్పడంలో ఆ రాష్ట్రాలు విఫలమయ్యాయని అభిప్రాయపడ్డారు.దేశంలోని ఆర్థిక నేరాల మీద రెవెన్యూ శాఖ కిందఉండే ఇన్‌ కంటాక్స్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌, డైరెక్టరేట్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌‌‌‌ (డీఆర్‌‌‌‌ఐ)లు దర్యాప్తు జరుపుతాయన్నారు. కర్నాటకలో కొంత మంది అవినీతి కార్యకలాపాలు బయటపడ్డాయని, ముఖ్యం గా పబ్లిక్‌‌‌‌ వర్క్స్‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌, సాంఘిక సంక్షేమ విభాగాలలోఅవినీతి వెల్లడైన నేపథ్యంలోనే దాడులు జరిగాయనిచెప్పారు. ఇక మధ్యప్రదేశ్‌‌‌‌ విషయానికి వస్తే, ప్రజలసంక్షేమం కోసం ఉపయోగించాల్సి న నిధులను రాజకీయాల కోసం దారి మళ్లిం చే ప్రయత్నాలు జరిగాయ-ని తెలిపారు. అభాగ్యులని కూడా చూడకుండా ఇలాచేస్తున్నారని, కాంగ్రెస్‌‌‌‌ పేరు తేకుండా జైట్లీ విమర్శించారు. ఇండియా రాజకీయాలలో హిపోక్రసీ ఈ విధంగా ఉంటోందని వ్యాఖ్యానించారు.