అమిత్ షా కు ఏపీ బీజేపీ ఎంపీల లేఖ

అమిత్ షా కు ఏపీ బీజేపీ ఎంపీల లేఖ

ఏపీ ఘటనలపై జోక్యం చేసుకోవాలని వినతి

విజయవాడ: అవకాశం దొరికినప్పుడల్లా రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న ఏపీ బీజేపీ నేతలు తాజాగా మరో అడుగు ముందుకు వేశారు. ప్రభుత్వం తీరును ఎండగడుతూ.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు భాజపా ఎంపీలు జీవీఎల్, సీఎం రమేశ్  లేఖ రాశారు. ఏపీలో ఇటీవల జరిగిన ఘటనలపై హోంశాఖ జోక్యం చేసుకోవాలని ఆ లేఖలో కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్య వ్యవస్థ లేకుండా పోయిందని లేఖలో ప్రస్తావించారు. హిందువులే లక్ష్యంగా అనేక ఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ ఘటనలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని అభిప్రాయపడ్డారు.