పెళ్ళికి ముందుకు అత్తతో ట్రిప్.. నిర్మాతగా ధోనీ : ఆసక్తికరంగా LGM ట్రైలర్

పెళ్ళికి ముందుకు అత్తతో ట్రిప్.. నిర్మాతగా ధోనీ : ఆసక్తికరంగా LGM ట్రైలర్

ఇండియన్ స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ(Mahendra singh Dhoni) సమర్పణలో, ఆయన సతీమణి సాక్షి(Sakshi) నిర్మిస్తున్న చిత్రం LGM(లెట్స్ గెట్ మ్యారీడ్). త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నుండి తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భాంగా నిర్వహించిన ఈవెంట్ లో ఈ చిత్ర నిర్మాత సాక్షితో సహా ఆమె భర్త ధోనీ కూడా హాజరయ్యారు.

ఈ సందర్బంగా రిలీజ్ చేసిన LGM ట్రైలర్(LGM Trailer) కు ఆడియన్స్ నుండి క్రేజీ రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ కూడా ఆధ్యాంతం చాలా ఫన్నీ గా సాగింది. చాల కాలంగా ప్రేమించుకుంటున్న ఒక జంట ఇరుకుంటుంబాలను ఒప్పించి పెళ్ళికి సిద్ధమవుతారు. కానీ అమ్మాయికి తన అత్తతో ఉండటం ఇష్టం ఉండదు. అందుకే ఆమెను అర్థం చేసుకోవడానికి పెళ్ళికి ముందు అత్తతో ఒక ట్రిప్ ప్లాన్ చేస్తుంది. మరి ఆ ట్రిప్ ముగిసేలోపు ఎం జరిగింది అనేది సినిమాలో చూపించబోతున్నారు మేకర్స్. అది కూడా చాలా ఫన్నీ వే లో. 

ఈ ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేలా ఉంది. ఇక ధోనీ సతీమణి నిర్మాత కావడంతో LGM పై అంచనాలు చాలానే నెలకొన్నాయి. మరి ఈ సినిమా నిర్మాతగా సాక్షికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక ఈ సినిమాలో హరీశ్ కల్యాణ్(Harish kalyan), ఇవానా(Ivana) ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. సీనియర్ నటి నదియా(Nadhiya) కీ రోల్ లో కనిపించనున్నారు.