హైదరాబాద్, వెలుగు: ఎల్ఐసీ 67వ వార్షికోత్సవం సందర్భంగా సైఫాబాద్లోని జోనల్ ఆఫీస్ లో సౌత్ సెంట్రల్ జోన్ జోనల్ మేనేజర్ ఎల్కే శ్యాంసుందర్ ఆధ్వర్యంలో శుక్రవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఎల్ఐసీ జెండా బెలూన్ ను ఎగురవేసిన అనంతరం జోనల్ మేనేజర్ మాట్లాడుతూ.. సాంకేతికతను మెరుగుపరచడంతోపాటు విధివిధానాలను పునరుద్ధరిస్తూ సర్వీసింగ్ పరంగా వినియోగదారుల అంచనాలకు మించి ముందుకు వెళ్లేందుకు సంస్థ సన్నద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్ఎం జి. మధుసూదన్, పి. రమేష్ బాబు, ఆర్ సతీష్ బాబు, రాజేష్ భరద్వాజ్, ఉతుప్ జోసెఫ్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఎల్ఐసీ ప్రతి ఏడాది సెప్టెంబర్ మొదటివారాన్ని బీమా వారంగా జరుపుకుంటుంది.