రూ.14,374 కోట్ల విలువైన ప్రీమియం... వసూలు చేసిన ఎల్ఐసీ

రూ.14,374 కోట్ల విలువైన ప్రీమియం... వసూలు చేసిన ఎల్ఐసీ

హైదరాబాద్​, వెలుగు: ఎల్​ఐసీ గత నెల వసూలు చేసిన ప్రీమియం విలువ ఏడాది లెక్కన 13.79 శాతం పెరిగింది. గత నెల   రూ.14,374.87 కోట్ల విలువైన ప్రీమియంను వసూలు చేసింది. ఇది 2024 మేలో రూ.12,632.26 కోట్లుగా నమోదయింది.  మొత్తం కొత్త వ్యాపార ప్రీమియం 10.27శాతం పెరిగి, 2024 మేలో రూ.16,690.39 కోట్ల నుంచి 2025 మేలో రూ.18,405.04 కోట్లకు చేరింది. మొత్తం జీవిత బీమా పరిశ్రమ రూ.30,463.20 కోట్లు ఆర్జించింది. 

గత సంవత్సరం ఇదే నెలలో వసూలు చేసిన రూ.27,034.14 కోట్ల కంటే 12.68శాతం ఎక్కువ. వ్యక్తిగత ప్రీమియం విభాగంలో, 2025 మేలో ఎల్​ఐసీ రూ.4,030.17 కోట్లు వసూలు చేయగా, 2024 మేలో రూ.4,058.13 కోట్లు వసూలు చేసింది. 2025 మేలో ఎల్​ఐసీ జారీ చేసిన మొత్తం పాలసీలు 10.68 లక్షలు కాగా, గత సంవత్సరం ఇదే కాలంలో 12.51 లక్షల పాలసీలు జారీ అయ్యాయి. 

వ్యక్తిగత పాలసీల సంఖ్య 2024 మేలో 12.48 లక్షల నుంచి 2025 మేలో 10.67 లక్షలకు తగ్గింది. గ్రూప్ పాలసీల సంఖ్య 2024 మేలో 2,279 నుంచి 2025 మేలో 1,389కి తగ్గింది.